Thursday, 16 April 2026 03:20:54 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గుండ్లపల్లి లో ప్రకృతి వ్యవసాయం తో వికసించిన ప్రకృతి వ్యవసాయ ఫలాలు

ఫోర్డ్ సంస్థ అవగాహనే ఆదర్శం

Date : 21 March 2026 09:00 PM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 21ః రసాయన ఎరువులు, క్రిమిసంహారాలతో పండిన ఫల సాయంతో నేటి సమాజం ఆరోగ్యాలు క్షీణించి నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో ఎడారిలో ఒయాసిస్ లా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ప్రేరణతో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు తంబళ్లపల్లెలో పోర్డు సంస్థ అవగాహనతో పురుడు పోసుకోవడం హర్షనీయం. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె పంచాయతీలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం పై స్థానిక రైతులకు రైతు యాత్రలు,అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం నింపి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడవడానికి పునాదులు వేశారు. ఫోర్డ్ సంస్థ చేసిన ప్రయత్నం ఫలించి నేడు గుండ్లపల్లి పంచాయతీ లో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పంటల ఫలాలతో సత్ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ప్రకృతి వ్యవసాయం లో భాగంగా సేంద్రియ ఎరువులు, పేడ ఎరువు, కషాయాలతో వేరుశనగ, మామిడి, మొక్కజొన్న, సుమారు 30 రకాల చిరుధాన్య పంటలు, ఆకుకూరలు, కూరగాయల పంటలు పండించడంతోపాటు అధిక దిగుబడి సాధించారు. ఇందులో భాగంగా శనివారం ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ, రమణ, సంపూర్ణ, హేమంత్, ఏ పి సి ఎన్ ఎఫ్ ప్రతినిధి రాజు గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అభినందించారు. రైతు నరసింహులు వేసిన మామిడి, అంతర్ పంట వేరుశనగ ఎకరాకు 15 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పడం తో ప్రకృతి వ్యవసాయం లో నైతిక విజయం సాధించి గుండ్లపల్లి రైతులు ఆదర్శంగా నిలిచినట్లు లలితమ్మ కొనియాడారు. అదేవిధంగా మరో రైతు మనోహర్ తనకున్న కొద్దిపాటి పొలంలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండించి లబ్ధి పొందడం విశేషం. ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుల పొలాలు భూసారం పెరిగి పండిన ఫల సాయం మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ కలుగుతుందని వారికి హితబోధ చేశారు. ఆమె వెంట ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :