నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 06 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్ ఎస్టేట్ నందు ఈరోజు కడప నుండి వచ్చిన విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా రైస్ మిల్లులో పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని పందికొక్కల్లాగా కొంతమంది అవినీతి అధికారులు డీటీలు సివిల్ సప్లై అధికారులు కొంతమంది చేతుల్లో ఐదు స్టోర్లు నాలుగు స్టోర్లు ఉండడం వల్ల పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని దొంగ మార్గం ద్వారా వీటిని పాలిష్ పెట్టి శుభ్రపరిచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారని ఇలాంటి రైస్ మిల్లర్స్ పై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ బియ్యాన్ని మిల్లులకు తరలించిన అవినీతి సివిల్ సప్లై అధికారులను అలాగే ఏ ఏ స్టోర్ ల నుండి పేదలకు సకాలంలో బియ్యం పంపిణీ చేయలేదు అని వాటిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి అవినీతి అధికారుల అక్రమ మార్గాల్లో సంపాదనే ధ్యేయంగా ఉన్న అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికార అధికార పై కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు
Admin
Namitha News