Thursday, 16 April 2026 06:52:29 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గోపిదిన్నె లో వైభవంగా హిందూ సమ్మేళనం

Date : 28 December 2025 10:10 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 28 : తంబళ్లపల్లె మండలం గోపి దిన్నె కొత్తపల్లి బస్ స్టాప్ లోని అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వారోత్సవ హిందూ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రతినిధి గంగారపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ మతంలో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతగా భావించాలన్నారు. నేడు హిందూ సమాజం ఇతర మతాలకు తరలి వెళ్లకుండా మన సంస్కృతి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నేటి తరం యువతకు సైతం మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు తో పాటు దైవచింతన, ఆధ్యాత్మికత, దేవుని ఆరాధించడం అలవాటుగా మార్చాలని హితవు పలికారు. హిందూ బంధువులు అలనాటి పురాతన కళలు కోలాటాలు, చెక్కభజనలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించి గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భజన గురువు ప్రభాకర్ రెడ్డి, మహిళా కళాకారిణి లక్ష్మీనరసమ్మ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :