నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 28 : తంబళ్లపల్లె మండలం గోపి దిన్నె కొత్తపల్లి బస్ స్టాప్ లోని అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వారోత్సవ హిందూ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రతినిధి గంగారపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ మతంలో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతగా భావించాలన్నారు. నేడు హిందూ సమాజం ఇతర మతాలకు తరలి వెళ్లకుండా మన సంస్కృతి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నేటి తరం యువతకు సైతం మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు తో పాటు దైవచింతన, ఆధ్యాత్మికత, దేవుని ఆరాధించడం అలవాటుగా మార్చాలని హితవు పలికారు. హిందూ బంధువులు అలనాటి పురాతన కళలు కోలాటాలు, చెక్కభజనలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించి గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భజన గురువు ప్రభాకర్ రెడ్డి, మహిళా కళాకారిణి లక్ష్మీనరసమ్మ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News