నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 12 : మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి రామాపురానికి చెందిన 40 సంవత్సరాల నరసింహులు హత్యకు అక్రమ సంబంధమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, మంగాపురం సమీపంలో సీఐ హత్య కేసుపై మీడియాతో మాట్లాడుతూ నరసింహులుతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, గడ్డఎత్తుపల్లెకు చెందిన నాగరాజు తన అనుచరులతో కలిసి అక్టోబర్ 27న తిరుపతి జిల్లా మంగాపురానికి తీసుకువచ్చి ఓ మామిడి తోట వద్ద పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నరసింహులు భార్య తమకు తన భర్త అదృశ్య మయ్యాడని ఇచ్చిన ఫిర్యాదు పై మొదట అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకోవడంతో నరసింహులు ను హత్య చేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు లో హంతకులు శవాన్ని పూడ్చిన ప్రదేశం చూపగ అక్కడ రెవిన్యూ, చంద్రగిరి పోలీస్ అధికారులు, మృతుని బంధువుల సమక్షంలో తవ్వడంతో నరసింహులు మృతదేహం లభించింది అన్నారు. అనంతరం వైద్యులతో స్పాట్ పిఎం చేపట్టి, ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు..
Admin
Namitha News