నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : రామసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు ఇంజం ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అత్యధిక భారీ మెజారిటీతో విజయదుంబి మోగించిన సందర్భంగా బిజెపి శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బానసంచాల నడుమ మిఠాయిలు పంచుతూ, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజం ఆనంద్ కుమార్, క్రిష్ణమూర్తి, చంద్రారెడ్డి శివకుమార్, బాలాజీ, చలపతి, డాక్టర్ నవీన్, ఆర్ టి సి విశ్రాంతి ఉద్యోగి రవీంద్రనాథ్ రెడ్డి, బద్రి, రాజు, వీరకుమార్,శేఖర్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News