నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : రామసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తికావడం తో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది వేడుకలు చేశారు. శుక్రవారం పోలీస్ సిబ్బంది స్వాతంత్ర సమర యోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి వారిని స్మరించుకుంటూ పూజాకార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వందేమాతరం నినాధాలతో స్టేషన్ మారుమోగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ దేశసేవలో తాము స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమం లో సురేంద్ర యాదవ్, మహ్మద్ బాషా భరత్ రెడ్డి, కప్యూటర్ ఆపరేటర్ జ్యోతి, సచివాలయ పోలీస్ మాదురీ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News