నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 11 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి.కొత్తకోట నగరంలోని ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజు మంగళవారం కొనసాగింది.ఉదయం 9:30 గంటలకు ప్రారంభించిన పాదయాత్ర పట్టణంలోని దర్గావీధులు,సింహంవీధి సంతబజార్,పాశంవీధి,వైశ్య బజార్,హరి మందిరంవీధి,పోకనాటి వీధి,SCకాలనీ,తిరుమల వీధి,కరెంటు కాలనీ తదితర పురవీధులలో పట్టణంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి చేరవేస్తూ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదగడుతూ,ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రతివీదిలోనూ పలు సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లి లు మాట్లాడుతూ; పట్టణంలో పలు ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చినాయని,వీటన్నింటి పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన నగర పంచాయతీ కార్యాలయం ఎదుట "ధర్నా" కార్యక్రమం నిర్వహించి తమ దృష్టికి వచ్చిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పిస్తామని,బి.కొత్తకోట పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ ఆధ్వర్యంలో అంచెలంచలుగా పోరాటాలు కొనసాగిస్తామని, ప్రజానీకం అందరూ కూడా ఈ పోరాటాలలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హెచ్.షమీవుల్లా యస్.హబీబ్,ఎం.గంగులప్ప,పి.రామచంద్ర,దుమ్ము బాబు,ఎస్.ఖాదర్ బాషా,షాకీర్,మస్తాన్,షఫీ,కాటమరాయుడు,బాబాజాన్,గంగులప్ప,రియాజ్,శ్రీరాములు,పి.నర్సింహులు,పి.గంగాద్రి,అంజి,వెంకటరమణ,వెంకటప్ప,పిటిఎంఅంజన్న,భాస్కర తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News