నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18 : వైఎస్సార్సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్ షరీఫ్ గురువారం టెలికాం అడ్వజరీ మెంబరు గా తిరుపతి టెలీకామ్ ఆఫీస్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా టెలికాం ఐటిఎస్ ఏవి శ్రీకుమార్ వద్ద షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన షరీఫ్కు మెమెంటో ఇచ్చి అభినందించారు. టెలికం సేవలు విస్తతం చేసేందుకు సహకరించాలని కోరారు. నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు.
Reporter
Namitha News