నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు 16 మంది క్యాడెట్స్ తో కూడిన యన్.సి.సి ఎయిర్ వింగ్ విభాగాన్ని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని 11(A) ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్నికల్), యన్.సి.సి నుండి అధికారిక అనుమతి లభించిందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు యన్.సి.సి. ఎయిర్ వింగ్ ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఏరోస్పేస్, ఏవియానిక్స్, డ్రోన్లు మరియు ఏవియేషన్ టెక్లో కెరీర్లకు బలమైన పునాది అని అన్నారు. విమాన ప్రాథమిక అంశాలు, ఏరోడైనమిక్స్, నావిగేషన్ మరియు వాతావరణ శాస్త్రం యొక్క ఆచరణాత్మక పై అవగాహన పెంచుకోవడం, మెకానికల్, ఈ.సి.ఈ, ఈఈఈ మరియు సి.ఎస్.ఈ (ఏ.ఐ మరియు డ్రోన్ టెక్) విద్యార్థులకు వాస్తవ-ప్రపంచ ఔచిత్యం లభిస్తుందని ఆయన అన్నారు. సి (C) సర్టిఫికేట్ హోల్డర్లు కు రక్షణ నియామకంలో బోనస్ మార్కులు మరియు మంచి ప్రాధాన్యత ఉంటుందని, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్(PSU)లు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు అంతకంటే ఎక్కువ వాటిలో వీరికి ఒక గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఎయిర్ వింగ్ ద్వారా విద్యార్థులకు విమానయానం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ప్రాథమిక శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం మరియు దేశసేవ పట్ల అవగాహన పెంపొందించే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో సేవలందించాలని ఆశించే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యా కార్యక్రమాలతో పాటు యెన్.ఎస్.ఎస్, యెన్.సి.సి మరియు నూతనంగా యెన్.సి.సి ఎయిర్ వింగ్ ప్రారంభం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యతాభావం మరియు జాతీయ సేవా స్పూర్తిని మరింత బలపరచడానికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, యెన్.సి.సి ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచీ పాల్గొన్నారు. మిట్స్ ఎయిర్ వింగ్ విభాగానికి ఎంపిక అయిన క్యాడెట్స్ కు యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News