నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 28 : రసాయన ఎరువుల పంటల తో అనారోగ్యంతో పాటు పర్యావరణం కాలుష్యం దృశ్య భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో స్వర్ణ యుగం సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోటకొండ, కుక్క రాజు పల్లి పంచాయితీలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుండి మద్దతు ఈ అంశాలతో ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ప్రతి రైతు రాబోయే ఐదేళ్లలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి ద్వారా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం వెంకట మోహన్ ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వారసత్వంగా రావాలని నేడు ప్రకృతి ఆధారిత పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా క్రిమిసంహారక మందులు వాడటం తగ్గించి ఆవు మూత్రం, పేడ, వేపాకు కషాయాలతో పంటల సస్య రక్షణ చేపట్టాలని తెలిపారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి పాడి పెంపకం, పాల ఉత్పత్తి, పశుగ్రాసం, నిరోధక టీకాలు, గోకులాలు, కోళ్ల పెంపకం పలు సూచనలు చేశారు.ఎఓ రమణ కుమార్ మాట్లాడుతూ రైతులు రైతన్న మీకోసం కార్యక్రమాల ద్వారా వ్యవసాయం, పశు వైద్యం పై అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, శిరీష, రత్నమాలిక, రైతులు నాగరత్నమ్మ , చిన్నపరెడ్డి , గాలి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News