Thursday, 16 April 2026 03:05:01 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ ఆశ్వ్ 2k26

Date : 23 March 2026 08:48 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 23 : అంగళ్ళు సమీపం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఆశ్వ్ 2k26 జాతీయ స్థాయి టెక్నో - కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా స్పోర్ట్స్ ను యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా లెక్కల హితేష్ రావు, నేషనల్ హాకీ ప్లేయర్ పాల్గొన్నారు. ముందుగా మిట్స్ యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో హితేష్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, దేశ నిర్మాణంలో క్రీడల ప్రాముఖ్యత గురుంచి తెలియజేశారు. క్రీడల్లో రాణించాలంటే ఓపిక, ధైర్యం, నిబద్ధత అవసరమని, గెలుపు కోసం కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని, అందుకు మనోధైర్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ప్రతి క్రీడాకారుడు నిరంతర శ్రమతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల కు జీవితాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని, క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆరోగ్యకరంగా మనము ఎదగాలని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాదెళ్ళ ద్వారకానాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో భాగంగా క్రికెట్, వాలీబాల్ , కబ్బడి మరియు ఇతర పోటీలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ, గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, శ్రీ లక్ష్మి ప్రీతీ, ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :