నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా జోనల్ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్ అధ్యక్షతన భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలను శనివారం మదనపల్లె ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి ముండా (1875–1900) బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గౌరవనీయమైన ఆదివాసీ నేత మరియు స్వాతంత్ర్య సమరయోధుడని మరియు ఆదివాసీ హక్కులు, స్వయం పాలన కోసం చేసిన ఆయన పోరాటం, స్థానిక గిరిజన సమాజాలకు ప్రతిఘటన మరియు శక్తివంతతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.ఆయన స్మరణార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 15న భారత్వ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నారు. 2024 నవంబర్ 15న, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్లోని జమూయి జిల్లాలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఆయన భారతీయ ఆదివాసీ వారసత్వం మరియు స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సేవలను ప్రముఖంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం పాటు జరుపుకునే కార్యక్రమాలు 2025 నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని వారి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నారద రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, సామాజిక సేవకురాలు పీట్ల అంజలి డేరంగుల రమేష్ రాజు,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News