Thursday, 16 April 2026 06:47:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె లో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు

భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు

Date : 15 November 2025 05:51 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా జోనల్ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్ అధ్యక్షతన భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలను శనివారం మదనపల్లె ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి ముండా (1875–1900) బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గౌరవనీయమైన ఆదివాసీ నేత మరియు స్వాతంత్ర్య సమరయోధుడని మరియు ఆదివాసీ హక్కులు, స్వయం పాలన కోసం చేసిన ఆయన పోరాటం, స్థానిక గిరిజన సమాజాలకు ప్రతిఘటన మరియు శక్తివంతతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.ఆయన స్మరణార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 15న భారత్‌వ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నారు. 2024 నవంబర్ 15న, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్‌లోని జమూయి జిల్లాలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఆయన భారతీయ ఆదివాసీ వారసత్వం మరియు స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సేవలను ప్రముఖంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం పాటు జరుపుకునే కార్యక్రమాలు 2025 నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని వారి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నారద రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, సామాజిక సేవకురాలు పీట్ల అంజలి డేరంగుల రమేష్ రాజు,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :