Wednesday, 29 July 2026 03:45:19 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కోసువారిపల్లె ఎన్.ఎల్.ఎం. గొర్రెల ఫార్మ్ ఆదర్శనీయం - డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాహెబ్

Date : 19 February 2026 10:22 PM Views : 276

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రైతు శ్రీనివాసులు రెడ్డి నిర్వహిస్తున్న గొర్రెల ఫార్మ్ గొర్రెల పెంపకం దారులకు ఆదర్శనీయమని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాబ్ కొనియాడారు. గురువారం ఆయన మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తో గొర్రెల ఫార్మ్ ను పరిశీలించారు. ఈ షెడ్డు నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ ద్వారా 20 లక్షల రుణంతో 100 గొర్రెలతో పథకం ప్రారంభించి విజయవంతంగా నడుస్తున్నట్లు రైతు డీడీకి వివరించారు. ఎన్ ఎల్ ఎం పథకంలో 10 లక్షల సబ్సిడీకి గాను మొదటి విడత సబ్సిడీ పొందానని రెండో విడత రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోసువారిపల్లి రైతు శ్రీనివాసరెడ్డి నీ ఆదర్శంగా తీసుకొని మండలంలోని గొర్రెల పెంపకం దారులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాడి ఆవులతో పాటు గొర్రెల పెంపకం పై దృష్టి సారించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: