Saturday, 12 September 2026 12:08:44 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

డ్రోన్ కెమెరాలకు 11 మంది కోడిపందెగాళ్లు అరెస్ట్

Date : 09 September 2026 06:53 PM Views : 31

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - డ్రోన్ కెమెరాలకు 11 మంది కోడిపందెగాళ్లు అరెస్ట్ మదనపల్లె : అన్నమయ్య జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ పోలీసులు నేరాలకు చెక్ పెడుతున్నారు.ఇందులో భాగంగా మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా పక్కాగా నిఘా ఉంచారు.గత జులై 28వ తేదీన మదనపల్లె మండలం,వలసపల్లె పంచాయతీ పరిధిలోని బోగిటివారిపల్లె వద్ద బహిరంగ ప్రదేశంలో అక్రమంగా కోడిపందేలు ఆడుతున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు.నిందితులపై ఏపీ గేమింగ్ యాక్ట్-1974 కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ కేసును విచారించిన మదనపల్లె సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్,పోలీసుల సాక్ష్యాధారాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో పట్టుబడిన 11 మంది నిందితులకు 10 రోజులపాటు జైలుశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేసిన మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ,ఎస్ఐలు విష్ణు నారాయణ,రామకృష్ణారెడ్డి,డ్రోన్ సర్వేలెన్స్ సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు.జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: