నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 06 ఃప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి భద్రతలో సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రాధాన్యత నివ్వాలని ఏపీడి చందన సూచించారు. సోమవారం పెద్దేరు ప్రాజెక్టులో చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ జలధార కార్యక్రమాల ద్వారా సాగునటి వనరుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల సంరక్షణ పనులకు ప్రాధాన్యత, రైతులకు సంబంధించిన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్ధితోపాటు కాలువల నిర్మాణాలు, నీటిని పొదుపు చేయడానికి ఆయకట్టు సంఘ సభ్యులతోపాటు రైతులు సహకరించాలన్నారు.పెద్దేరు చైర్మన్ శివకుమార్ ప్రాజెక్టుకు రోడ్డు సౌకర్యం, పార్క్ అభివృద్ధి, ఆయకట్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు. పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇరిగేషన్ డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎ.ఈ సతీష్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బాలగంగాధర్, భూదేవి, చెరువు సంఘం అధ్యక్షులు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, టిడిపి నాయకులు రామచంద్ర, రాము, పురుషోత్తం, జనసేన నాయకుడు నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దేరు ఆయికట్టు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News