Thursday, 30 July 2026 08:30:20 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏపీడి చందన

Date : 06 April 2026 09:40 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 06 ఃప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి భద్రతలో సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రాధాన్యత నివ్వాలని ఏపీడి చందన సూచించారు. సోమవారం పెద్దేరు ప్రాజెక్టులో చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ జలధార కార్యక్రమాల ద్వారా సాగునటి వనరుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల సంరక్షణ పనులకు ప్రాధాన్యత, రైతులకు సంబంధించిన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్ధితోపాటు కాలువల నిర్మాణాలు, నీటిని పొదుపు చేయడానికి ఆయకట్టు సంఘ సభ్యులతోపాటు రైతులు సహకరించాలన్నారు.పెద్దేరు చైర్మన్ శివకుమార్ ప్రాజెక్టుకు రోడ్డు సౌకర్యం, పార్క్ అభివృద్ధి, ఆయకట్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు. పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇరిగేషన్ డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎ.ఈ సతీష్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బాలగంగాధర్, భూదేవి, చెరువు సంఘం అధ్యక్షులు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, టిడిపి నాయకులు రామచంద్ర, రాము, పురుషోత్తం, జనసేన నాయకుడు నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దేరు ఆయికట్టు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :