Tuesday, 15 September 2026 06:50:36 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

కార్మికుల సమ్మెతో తంబళ్లపల్లె కంపు.. కంపు..!

Date : 02 June 2026 10:31 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని పంచాయితీ పారిశుద్ధ్య, పంప్ ఆపరేటర్లు పనులు ఆపేయడంతో తంబళ్లపల్లె ఒక్క రోజుకే కంపు కొడుతుంది. గత మూడు మాసాలుగా పంచాయతీ కార్మికులకు జీతాలతో పాటు మరమ్మత్తుల బిల్లులు చెల్లించకపోవడంతో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ్యపు పనులతో పాటు తాగునీటి సరఫరా సైతం ఆపేయడంతో తంబళ్లపల్లె ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్న వారు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి మంగళవారం సెలవు పై వెళ్లడంతో వారి సమస్య పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. తంబళ్లపల్లె మండల కేంద్రంలో ప్రతిరోజు సుమారు ఐదు ట్రాక్టర్ల చెత్తాచెదారం తరలించాల్సి ఉండగా ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోతోంది. మురికి నీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం తో ముక్కు పగిలేలా దుర్వాసన కొడుతోంది. ఉదయం నుండి నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వద్ద అన్ని రకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు. అయితే ప్రజల మౌలిక సదుపాయాలు ,సమస్యల పట్ల నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పంచాయతీలో నిధులు ఉన్నా చెల్లించడానికి కుంటి సాకులు చెప్పడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి పారిశుద్ధ్యపు పనులు, నీటి సరఫరా చేయకపోతే తంబళ్లపల్లెలో పారిశుధ్యం లోపించి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కాదు స్వచ్ఛ చెత్త కుప్పల కేంద్రంగా నిలవడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: