నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె మండలంలోని పాడి రైతులు పశుగ్రాసం లేకw వేల రూపాయలు ఖర్చు చేసి పశుగ్రాసం కొనలేక పాడి ఆవులను తెగ నమ్ముకుని నష్టాల బాటలో పయనిస్తున్నారు. మండలంలో రైతులు, కూలీలకు జీవనాధారంగా నిలిచిన పాడి పరిశ్రమ పశుగ్రాస కొరతతో కుదేలైంది. గత ఖరీఫ్ సీజన్లో ప్రతి ఇంటికి పాడియావు కలిగి పాల దిగుబడితో తమ కుటుంబాలను నెట్టుకొస్తూ వచ్చారు. అయితే గత రెండు మాసాలుగా సమీప ప్రాంతాలలో గల కొండలు గుట్టలు అగ్నికి ఆహుతి కాగా తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. కొందరు రైతులు విధి లేని పరిస్థితుల్లో పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి వేరుశెనగ చెక్క, వరిగడ్డి ఒక్క లోడు రూ 25 వేల నుండి రూ 30 వేల వరకు ఖర్చు చేసి దిగుమతి చేసుకుని పాడియావులను సంరక్షించుకుంటుండగా ఆర్థిక స్తోమత లేని రైతులు పశుగ్రాసం కొనలేక పాడి పశువులను ఆయన కాడికి అమ్ముకుంటున్నారు. తరచూ కరువు బారిన పడుతున్న తంబళ్లపల్లె పాడి రైతులను సబ్సిడీ పశుగ్రాసం తో పాటు పశువుల దాణా పంపిణీ చేయాలని స్థానిక పాడి రైతులు కోరుకుంటున్నారు
Reporter
Namitha News