నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : మారుమూల గ్రామాలలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధంపై దృష్టి సారించి ప్రజలు ఐవీఆర్ లో ఒకటి నొక్కేలా పనిచేయాలని డిప్యూటీ ఎంపీడీ వో ఎంపీ ప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన రేణుమాకులపల్లి లో పారిశుధ్య నిర్వహణపై గ్రీన్ అంబాసిడర్ల పనితీరు ను అభినందిస్తూ ఉదయాన్నే గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి ఎరువు తయారు చేయాలని సూచించారు. పారిశుధ్యం తో పాటు తాగునీరు, వీధిలైట్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కార్యదర్శి నాయక్ ను ఆదేశించారు
Reporter
Namitha News