Wednesday, 29 July 2026 09:11:52 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ సమైక్యతా దినోత్సవం

Date : 19 November 2025 07:11 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ సమైక్యతా దినోత్సవం అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో బుధవారం(19-11-2025) ఎన్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య సోదర భావం మానవత్వం, సమైక్యత, దేశభక్తి, సామజిక విలువలు ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి భద్రతలు వుంటాయని, భారత దేశ తొలి మహిళా ప్రధాన మంత్రి అయిన శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా నవంబర్ 19 న జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకొంటారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ భాషా, మతం అనే బేధాలు లేకుండా అందరూ కలసి కట్టుగా జీవించాలని తెలిపారు. ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ మాట్లాడుతూ ఎన్. ఎస్. ఎస్ విద్యార్థులు విద్య మరియు సాంస్కృతిక రంగాలలో కూడా సమైక్యతా భావం తో ముందుకు రావాలని తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీ లో 105 మంది, తెలుగు ప్రసంగాలు లో 32 మంది, ట్రేడిషనల్ షో లో 42 మంది పాల్గొనట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, అధ్యాపకులు, ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: