నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీలో పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు - ఎన్టీఆర్ భరోసాతో లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి స్పష్టం మదనపల్లె : సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో ఏపీ ముందు వరుసలో నిలుస్తోందని తెలుగుదేశం యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) స్పష్టం చేశారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు బుధవారం 14వ వార్డు పరిధిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని,సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.ముఖ్యంగా ప్రతినెల 1వ తేదీ వృద్ధులు,దివ్యాంగులు,వితంతువులు,ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనన్నారు.రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు.14వ వార్డు పరిధిలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూరుస్తున్నామని వెల్లడించారు.
Reporter
Namitha News