Wednesday, 29 July 2026 08:17:17 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఎల్‌నినో సవాళ్లకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం, ఆరుతడి పంటల సాగును విస్తరించాలంటున్న అధికారులు

పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై కేశాపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన చేసిన కలెక్టరు

Date : 30 June 2026 05:20 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండెం - జూన్ 30 : రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టరు పరిశీలించారు. ముందుగా రైతు ఖదర్ నిషా అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్.. పంటల పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, నీటి వినియోగం, ఖర్చులు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్కువ నీటితోనూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు. అనంతరం విత్తన పెల్లెటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. విత్తనాలకు సహజ పదార్థాలతో పూత పూయడం వల్ల మొలక శాతం పెరగడం, ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల మెరుగుపడడం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడం, వేర్ల అభివృద్ధికి దోహదపడడం వంటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా అక్కడి రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ..., ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులను, వర్షపాతం తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమున్న పంటలపై పూర్తిగా ఆధారపడకుండా, స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును, నీటి సంరక్షణ పద్ధతులను గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు అధికారులు–రైతులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎల్‌నినో దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయం, ఆరుతడి పంటల సాగు, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. నీటి సంరక్షణతో పాటు రైతుల ఆదాయం స్థిరంగా ఉండేలా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల సారం పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకట మోహన్, ఎఫ్‌ఎం‌టి సిద్ధయ్య, పద్మావతి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలు, రైతులకు అందిస్తున్న సాంకేతిక సేవలపై అధికారులు కలెక్టర్‌కు వివరించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :