Wednesday, 16 September 2026 02:01:08 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

కెరీర్ గైడెన్స్ పై మిట్స్ విద్యార్థులకు అతిధి ఉపన్యాసం

Date : 20 May 2026 08:54 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 20 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ (IRC) మరియు ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (IETE) విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో “కెరీర్ గైడెన్స్” పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలో హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్ & అడ్మిన్‌గా పనిచేస్తున్న మనీష్ మజుందార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. తన పరిశ్రమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ, టెక్నికల్ నాలెడ్జ్, లీడర్‌షిప్ లక్షణాలు, టీమ్‌వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, రిజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు మరియు నిరంతర అభ్యాసం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆటోమేషన్ మరియు డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో భవిష్యత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, వర్క్‌షాప్స్ మరియు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలలో జరిగే నియామక విధానాలు, ఆప్టిట్యూడ్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ మరియు హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలలో విజయవంతం కావడానికి అవసరమైన అంశాలపై అవగాహనా కలిపించారు. కార్యక్రమం చివర్లో నిర్వహించిన ప్రశ్నోత్తర సమావేశంలో విద్యార్థులు కెరీర్ ప్లానింగ్, ఉన్నత విద్య, ప్లేస్‌మెంట్స్ మరియు పరిశ్రమల అంచనాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గోరె, డాక్టర్ వి జయప్రకాశన్, అసిస్టెంట్ డీన్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :