Tuesday, 15 September 2026 10:48:05 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు

Date : 31 December 2025 05:17 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు - హాజరైన ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ బాషా - కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్లేకార్డుల ప్రదర్శన - వేలాదిగా తరలివచ్చిన ప్రజలు,విద్యార్థి,యువత,మహిళలతో కిక్కిరిసిన పుర వీధులు మదనపల్లె : మదనపల్లి కేంద్రం గా జిల్లా ఆవిర్భావమైన శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం.షాజహాన్ భాషా ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.స్థానిక పుంగనూరు రోడ్డులోని మిషన్ కాంపౌండ్ నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీకి మదనపల్లె నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,స్వచ్ఛంద సేవా సంస్థలు,ప్రజలు,విద్యార్థులు,మహిళలు,యువత హాజరై పాలుపంచు కున్నారు.దశాబ్దాల కలగా మిగిలిన మదనపల్లి ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున మహిళలు,స్వచ్ఛంద సంస్థలు, తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,ప్రజలతో కలిసి ర్యాలీ ముందుకు సాగింది.ఇందులో భాగంగా మిషన్ కాంపౌండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా వాల్మీకి సర్కిల్,టౌన్ బ్యాంక్ సర్కిల్,అవెన్యూ రోడ్డు,బెంగళూరు బస్టాండు అనిబిసెంట్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ముందుకు సాగింది.ఇందులో భాగంగా అని బిసెంటుకు మదనపల్లి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచ్చేసి,ప్రదర్శనలో భాగస్వాములు కావడం జరిగింది.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ బాషాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని,దశాబ్దాల కల మదనపల్లె జిల్లా కలను నెరవేర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు.చారిత్రాత్మక మదనపల్లె జిల్లా ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమన్నారు.మదనపల్లి,తంబళ్లపల్లి,పీలేరు,పుంగనూరు నియోజకవర్గ వర్గాల ప్రజలకు ఒక పండుగ రోజన్నారు.నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మదనపల్లి జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని ప్రజల తరఫున వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్,1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్,ఆర్.జె.వెంకటేష్,జంగాల వెంకటరమణ,రెడ్డి షంషీర్,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),బొమ్మిశెట్టి పురుషోత్తం,యర్రబల్లి వెంకటరమణారెడ్డి,మోడెం సిద్ధప్ప,రాటకొండ శ్రీనివాస నాయుడు,కొరముట్ల నాగరాజు,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు తలారి రాధమ్మ,బీదం గురునాథ్ యాదవ్,జీవి నాయుడు,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,జెసిబి వేణు,బాలమాలి శేఖర్,రెడ్డి రాయల్,మంజునాథ్ పెద్దసంఖ్యలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :