నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వేడుకగా సాగిన మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం - ఘనంగా సన్మానించిన ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మదనపల్లె : పట్టణంలోని మార్పురి వీధి,శీనా టీ స్టాల్ వద్ద ఆదివారం నూతన మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులు శ్రీరామ్ చినబాబును ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా,వాస్తవాలను ఆధారంగా చేసుకుని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.నూతనంగా ప్రారంభమైన మదనపల్లె ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమానికి,వృత్తిపరమైన అభివృద్ధికి వేదికగా నిలవాలని కోరుకున్నారు.ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక పాత్రికేయులు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీరామ్ చినబాబు ప్రశంసించారు.ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్,మహబూబ్ ఖాన్,ప్రెస్ క్లబ్ నిర్వాహకులు,పలువురు పాత్రికేయులు,తెలుగు యువత నాయకులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News