Tuesday, 15 September 2026 06:51:25 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చట్టాలను నిరసిస్తూ 30 న ప్రతిజ్ఞ ను జయప్రదం చెయ్యండి - సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

Date : 29 January 2026 09:56 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 30 న ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన విబిజి ఆర్‌ఎఎం జి, విద్యుత్‌ చట్టాల సవరణ, లేబర్‌కోడ్లు, సీడ్‌ బిల్లు, మినీ అణు విద్యుత్‌ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకువస్తోందని చెప్పారు. ప్రజలు తేరుకునే లోపే వీటిని అమలులోకి తీసుకువస్తోందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చెయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపుంచ్చిందని జయప్రదం చెయ్యాలని పిలునిచ్చారు. విబిజీ ఆర్‌ఎఎం జీతో ప్రజలకు తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులిచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందని, పనిదినాల్లోనూ కోత పెట్టిందని విమర్శించారు. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని, దేశంలో సామాజికన్యాయం పూర్తిగా దెబ్బతిని, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇటీవల చేసిన కొన్ని సవరణలతో కూలీలకు పని కల్పించడం కష్టమై, పథకం నిర్వీర్యమవుతుందని అన్నారు. కూలీల అవసరాల మేరకు కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని తెలిపారు. విద్యుత్‌ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్‌సబ్సిడీ రద్దవుతుందని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్‌ హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటుందని, పేదలపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ఇచ్చే సబ్సిడీని ఎత్తేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుండి లేబర్‌కోడ్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారని, దీనివల్ల కార్మికులు కనీస హక్కులతోపాటు సమ్మె హక్కునూ కోల్పోతారని, ఎనిమిది గంటల పనివిధానం రద్దవుతుందని తెలిపారు. యూనియన్ల కోసం కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యం అవుతాయని తెలిపారు. ప్రమాదకరమైన మినీ న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్లను విదేశీ వ్యక్తులు నేరుగా ఏర్పాటు చేసుకునేలా బిల్లు తెస్తున్నారన్నారు. వాటిల్లో ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి వారు బాధ్యత వహించరని, ప్లాంటు రేడియేషన్‌, ప్రాణనష్టానికి కూడా విదేశీ వ్యక్తుల బాధ్యతలేని విధంగా చట్టాలు ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. సీడ్‌ బిల్లు వల్ల మోన్‌శాంటో, కార్గిల్‌ వంటి సంస్థలకు లాభాలు వస్తాయని, వ్యవసాయం దెబ్బతినిపోతుందని హెచ్చరించారు. ఇటువంటి చట్టాలను అత్యంత వేగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని, వీటిని సిపిఎం వ్యతిరేకిస్తున్నదని, ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: