నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : **నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ** నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైంది. ** సంపన్న వర్గాల కోసం సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు **సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం సామాన్యుల పైన ఆర్థిక భారం మోపుతున్నారని,నిత్యవసర సరుకులు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని,సామాన్యుల జీవన విధానం అగమ్యగోచరంగా మారిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ,ప్రజలకు నిత్యం వంటగదిలో వాడే ఉప్పు,పప్పు,నూనె,ఎర్రగడ్డ,తెల్లగడ్డ,చక్కె వంటి వంటకు ఉపయోగించే నిత్యవసర సరుకులు పైన అధికంగా రేట్లు పెంచడం దుర్మార్గం అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో నిత్యవసర సరుకులు,పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వర్గాలకు కోట్ల రూపాయలు రాయతీలు ఇచ్చిదేశంలో ప్రజలను బికారీలుగా మార్చేశారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను మరచిపోయి కేంద్రం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థించుకుంటూ,ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్నాదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని,పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుమలప్ప, ముని రెడ్డి,చలపతి,శ్రీనివాసులు, తరుణ్ నవ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News