Saturday, 12 September 2026 01:52:35 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ఎయిడ్స్ నివారణకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలి

జిల్లాలో చురుగ్గా ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు – జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్

Date : 03 September 2026 07:59 PM Views : 48

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 03: జిల్లాలో ఎయిడ్స్‌ నియంత్రణ, నివారణపై అవగాహన కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ ఎల్. రాధిక ఆదేశాల మేరకు దిశా ఆధ్వర్యంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ, ఎన్‌జీవో ప్రతినిధులతో స్థానిక డీహెచ్‌ఓ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ ఏఆర్టీ, ఐసీటీసీ, ఎన్‌జీవోలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

గత నెల 12వ తేదీ నుంచి జిల్లాలోని మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలు, అధిక ప్రమాద ప్రాంత గ్రామాల్లో ఎయిడ్స్‌పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. రెండు నెలలపాటు హైరిస్క్ గ్రామాలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎయిడ్స్ పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సేవలు అందించాలని స్పష్టం చేశారు. గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

ఈ సమావేశంలో దిశా సిబ్బంది ఆనంద్, సిలార్, కౌన్సిలర్లు జయకుమార్, పుల్లయ్య నాయుడు, చంద్ర మోహన్, ఎన్‌జీవో ప్రతినిధులు అలావల్లి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :