నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం ఉపాధ్యాయులు - ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె : పట్టణంలోని ఎన్విఆర్ కళ్యాణ మండపంలో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులను సమావేశపరిచి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విలువులతో కూడిన విద్యను అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాలువ కప్పి,మెమెంటోలతో సత్కరించారు.నియోజకవర్గ నలుమూలాల నుండి తరలి వచ్చిన గురువులను ఆప్యాయంగా పలకరించి వారి సేవలు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుర్తు చేశారు.ఉపాధ్యాయ వృత్తిని భారతదేశ ప్రయోగశాలగా అభివర్ణించారు.ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే వరకు ఉపాధ్యాయులు విశ్రమించరన్నారు.అటువంటి ఉపాధ్యాయులను తన చేతుల మీదుగా సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ,టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,మూడు మండలాల ఎంఈఓ లు,ప్రభాకర్ రెడ్డి,పద్మావతి,రాజగోపాల్,విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ సేతు,టీచర్స్ యూనియన్ నాయకులు హేమలత,ఉర్దూ ఉపాధ్యాయుడు మహమ్మద్,షబ్బీర్,ఇస్మాయిల్,నవీన్ చౌదరి,పోర్డ్ లలితమ్మ,ధాత్రి పౌండేషన్ డాక్టర్ స్వాతి,పోలీస్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News