నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఐ.ఈ.ఐ. వారి ఆధ్వర్యంలో “యోలో మోడల్ ద్వారా ఆబ్జెక్ట్ డిటెక్షన్” అనే అంశంపై ఒక రోజు హ్యాండ్స్-ఆన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోలో (కేవలం ఒక్కసారి మాత్రమే విశ్లేషించడం) మోడల్ ద్వారా చిత్రాలు, వీడియోల్లో వస్తువులను ఒక్కసారి విశ్లేషణతో వేగంగా, ఖచ్చితంగా గుర్తించే విధానాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు. గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యోలో మోడల్ కీలక పాత్ర పోషిస్తోందని, లైవ్ సెక్యూరిటీ కెమెరాలు, స్వయంచాలక వాహనాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అనేక రంగాల్లో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోందని తెలిపారు. అలాగే వస్తువుల స్థానాన్ని బౌండింగ్ బాక్సుల రూపంలో చూపించే ప్రత్యేకత గురించి వివరించారు. పరిశ్రమల్లో నాణ్యత పరిశీలన నుంచి వైద్య రంగంలో ఎక్స్రే విశ్లేషణ వరకు యోలో వినియోగం పెరుగుతోందని అన్నారు. చిన్న ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్స్ చేయడం ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు సిద్ధమై ఉద్యోగ నియామకాలలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు . కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ , కోఆర్డినేటర్ పి.ఉదయ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News