నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 09 : మదనపల్లి నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన టి. మాధవి మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి. మాధవి జిల్లా కలెక్టర్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మదనపల్లి మండల పరిధిలోని రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు,జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు
Reporter
Namitha News