నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : పుల్లంపేట - జనవరి 11 : తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి లో మగవారి పొంగళ్ల పండుగ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ సంజీవరాయ స్వామికి సంక్రాతి పండుగ ముందు వచ్చే ఆదివారం రోజున మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టడం ఆనవాయితీ ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ పండుగ సందర్భంగా మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్ల పండుగను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన మగవారి పొంగళ్లకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Admin
Namitha News