Sunday, 13 September 2026 05:40:10 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు.

Date : 13 September 2026 04:24 PM Views : 7

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -సెప్టెంబర్ 13 : మదనపల్లె సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ‘ఎకో బప్పా మోరియా 3.0’ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 74 బృందాలు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆకృతుల్లో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను రూపొందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, వినాయక చవితి హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని, అయితే రసాయనాలు, హానికర పదార్థాలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు, పర్యావరణం కలుషితమవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని, మట్టి మన జీవనానికి ఆధారమైన సహజ వనరు కాబట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలించిన అనంతరం మొదటి బహుమతిని ఆర్.అనూష & టీం, రెండవ బహుమతి ఎస్ లహరి & టీం మరియు మూడవ బహుమతి అభిషేక్ & టీం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ & అసిస్టెంట్ డీన్- అక్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్, సి.ఎస్.టి విభాగాధిపతి డాక్టర్ దినేష్, ఎంఎస్ ఆర్ క్లబ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి. రెడ్డి హేమంత, శాయీజ్ అహమ్మద్, డాక్టర్ నవీన్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :