నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 01 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం లో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకనాథ్, ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మరియు అధ్యాపకులు కేకును కట్చేసి ఘనంగా జరుపుకున్నారు. ప్రో ఛాన్సలర్ యెన్ ద్వారకనాథ్ మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరంలో మిట్స్ కళాశాల అటానమస్ స్థాయి నుండి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి రావడం వెనుక విద్యార్థులు మరియు అధ్యాపకుల కృషిని ప్రశంసిస్తూ, సాధించిన విజయాలను నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలను తెలుపుతూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాల విద్యను అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక ల్యాబొరేటరీస్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అకాడమిక్ మరియు వ్యక్తిగత అభివృద్ధిలో ఉత్తమ ప్రతిభను కనబర్చాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. 2026 లో కూడా అందరికి మంచి జరగాలని మరియు మిట్స్ యూనివర్సిటీ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం అందరం కృషిచేయాలని ఆయన అన్నారు. వేడుకలలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అడ్వైసర్స్ , వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News