Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

Date : 01 January 2026 08:58 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 01 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం లో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకనాథ్, ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మరియు అధ్యాపకులు కేకును కట్చేసి ఘనంగా జరుపుకున్నారు. ప్రో ఛాన్సలర్ యెన్ ద్వారకనాథ్ మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరంలో మిట్స్ కళాశాల అటానమస్ స్థాయి నుండి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి రావడం వెనుక విద్యార్థులు మరియు అధ్యాపకుల కృషిని ప్రశంసిస్తూ, సాధించిన విజయాలను నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలను తెలుపుతూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాల విద్యను అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక ల్యాబొరేటరీస్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అకాడమిక్ మరియు వ్యక్తిగత అభివృద్ధిలో ఉత్తమ ప్రతిభను కనబర్చాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. 2026 లో కూడా అందరికి మంచి జరగాలని మరియు మిట్స్ యూనివర్సిటీ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం అందరం కృషిచేయాలని ఆయన అన్నారు. వేడుకలలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అడ్వైసర్స్ , వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :