నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 26 : రామసముద్రం మండలం లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్ ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి భారతరాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, దళితసంఘనాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం 1949 నవంబర్ 26 న భారతరాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని దీనిని గుర్తు చేసుకుంటూ ఈ దినాన్ని సంవిధాన్ దివాస్ గా పునాది వేసిందని, రాజ్యాంగం ప్రతి పౌరిడికి హక్కులు మాత్రమే కాకుండా కర్తవ్య బాధ్యతలను కూడ స్పష్టంగా సూచిస్తుందన్నారు. రాజ్యాంగం కేవలం ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సోదర బావం వంటి విలువలకు మూలాధారమన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్, ఎంపిడిఓ లతీఫ్ ఖాన్,ఆర్ ఐ వసీం,డీటీ ఎం ఈ ఓ 2 ఆంజనేయులు,పలు పాఠశాల హెచ్ ఎంలు మునిస్వామి నాయక్ చిట్టిబాబు, తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత, వెంకటరమణ నాయుడు,వెంకటా చలపతి రాజు, వి ఆర్ ఓ లు రెహ్మాన్ జగదీష్,రాంమోహన్, భార్గవి, మమత,దళిత సంఘనాయకులు మాజీ జడ్పీటీసీ శివశంకర్,ఎం ఆర్ పి యస్ రాజేష్,బాలాజీ,భాస్కర్, మెకానిక్ వెంకటేష్, శివ, నాగరాజు అంబరీష్,గంగాధర్,సత్యనారాయణ చంద్ర,సుధాకర్,ప్రశాంత్, సోము,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News