Saturday, 12 September 2026 05:33:45 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రామసముద్రం లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

Date : 26 November 2025 05:16 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 26 : రామసముద్రం మండలం లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్ ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి భారతరాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, దళితసంఘనాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం 1949 నవంబర్ 26 న భారతరాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని దీనిని గుర్తు చేసుకుంటూ ఈ దినాన్ని సంవిధాన్ దివాస్ గా పునాది వేసిందని, రాజ్యాంగం ప్రతి పౌరిడికి హక్కులు మాత్రమే కాకుండా కర్తవ్య బాధ్యతలను కూడ స్పష్టంగా సూచిస్తుందన్నారు. రాజ్యాంగం కేవలం ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సోదర బావం వంటి విలువలకు మూలాధారమన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్, ఎంపిడిఓ లతీఫ్ ఖాన్,ఆర్ ఐ వసీం,డీటీ ఎం ఈ ఓ 2 ఆంజనేయులు,పలు పాఠశాల హెచ్ ఎంలు మునిస్వామి నాయక్ చిట్టిబాబు, తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత, వెంకటరమణ నాయుడు,వెంకటా చలపతి రాజు, వి ఆర్ ఓ లు రెహ్మాన్ జగదీష్,రాంమోహన్, భార్గవి, మమత,దళిత సంఘనాయకులు మాజీ జడ్పీటీసీ శివశంకర్,ఎం ఆర్ పి యస్ రాజేష్,బాలాజీ,భాస్కర్, మెకానిక్ వెంకటేష్, శివ, నాగరాజు అంబరీష్,గంగాధర్,సత్యనారాయణ చంద్ర,సుధాకర్,ప్రశాంత్, సోము,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :