Thursday, 16 April 2026 06:42:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల నందు ఏఐ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ పై అవగాహన కార్యక్రమం

Date : 13 November 2025 05:07 PM Views : 55

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల నందు ఏఐ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం 07 నవంబర్ 2025 తేదీన నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆర్థిక లావాదేవీలలో జరుగుతున్న మోసాల రకాలపై అవగాహన కల్పించడం మరియు వాటిని కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో గుర్తించడం, నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా డా. నవీన్ విజయ్ ఆర్లాండో ఎఫ్., అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు వెర్టికల్ హెడ్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, రేవా యూనివర్సిటీ వారు హాజరై, పాల్గొనినవారికి విలువైన జ్ఞానం అందించారు. తన ప్రసంగంలో ఆయన కింది అంశాలను విశదీకరించారు. 1.ఆర్థిక లావాదేవీలలో జరిగే మోసాల రకాలు, 2 ఆన్లైన్ లావాదేవీల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, 3.ఫిర్యాదుల పరిష్కార విధానం అంశాలను క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేశారు. డా. నవీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు ఎలా మోసపూరిత కార్యకలాపాలను గుర్తించి వాటిని నివారించగలవో విశదీకరించారు. ఈ సెషన్ ఎంతో ఆసక్తికరంగా సాగి, పాల్గొన్నవారికి ఆర్థిక భద్రతపై విలువైన అవగాహన కలిగించారు. ఇప్పటి డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను గుర్తించడంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థలు లావాదేవీలలోనే అనుమానాస్పద నమూనాలను గుర్తించి మోసపూరిత చర్యలను ముందుగానే అరికట్టగలవు. ప్రజల సురక్షితంగా ఆర్థిక లావాదేవులు చేయాలంటే కింది సూచనలు పాటించాలి 1.ఆన్లైన్ చెల్లింపులను పరిమితంగా ఉపయోగించండి 2.నమ్మకమైన మరియు సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే లావాదేవులు చేయండి 3.డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు సివివి నంబర్లు మరియు పాస్వర్డ్ లను ఎవరికి పంచుకోకండి 4.సోషల్ మీడియాలో లేదా తెలియని లింకుల ద్వారా మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇవ్వద్దు 5.ఏదైనా అనుమానస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. ఏఐ సాంకేతికత మన ఆర్థిక భద్రతకు ఒక బలమైన రక్షణగా మారుతుంది మనమంతా జాగ్రత్తగా ఉండి సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం కు 900 మంది వివిధ రాష్ట్రాల నుండి మరియు దేశాల నుండి పాల్గొని ఏఐ సాంకేతికతను తెలుసుకోవడం జరిగినదని విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. డి. రమణ రెడ్డి, తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు ఎక్కువ మోతాదులో రెస్పాన్స్ రావడం వలన ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణ రెడ్డి ని సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ తో సత్కరించారు.ఈ కార్యక్రమం డా. జె. మహేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ & డీన్ FDP, మరియు వి.ఆర్. రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, FDP కోఆర్డినేటర్గ వ్యవహరించి ఇద్దరు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. యాజమాన్యం శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి వీరిని అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :