నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : మండలంలోని కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు బావాజీ, నరేందర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక యువనేత కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్ను శుక్రవారం రియల్ టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి (బెంగళూరు మల్లి) లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 36 క్రికెట్ టీమ్ లు పాల్గొంటున్నాయని ఇందులో టోర్నమెంట్ విన్నర్ కు 30000, రన్నర్ కు 20000 తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, నైన్ ఆఫ్ ది సిరీస్ ఉంటాయని క్రికెటర్లకు భోజన వసతి, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రారంభ మ్యాచ్ కోసువారిపల్లి, కుక్క రాజు పల్లి జట్లు తలపడగా కోసువారిపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువత లో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోసువారిపల్లె తోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెట్ క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు
Reporter
Namitha News