నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 29 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం నుండి ప్రధాన రహదారులు గుంతల మాయమై వాహనదారులతో బాటు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారుల ప్రయాణాలలో పలు ప్రమాదాలు జరిగి వాహన చోధకులు ఆసుపత్రి పాలవుతున్నారు. తంబళ్లపల్లె నుండి మొలకలచెరువు, దేవల చెరువు, పెద్దమండెం రహదారులలో పలుచోట్ల గుంతలు ఏర్పడి పర్యాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొలకలచెరువు రహదారిలో వారికి సంబంధించిన భారీ వాహనాల తో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు మొలకలచెరువు రహదారి తో పాటు ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గుంతలు పూర్తి ప్రమాదాలను నివారించాలని వాహన దారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News