Saturday, 12 September 2026 01:54:32 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన పురుం వెంకటరమణ - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం

Date : 05 September 2026 08:26 PM Views : 59

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన పురుం వెంకటరమణ - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం - ప్రదానం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా,జిల్లా కలెక్టర్ మదనపల్లె : మదనపల్లి పట్టణంలోని వివేకానంద మునిసిపల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పురుం వెంకటరమణ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చారని,ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపిక చేయగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మదనపల్లి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అవార్డును ఆయన ప్రదానం చేశారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాలుగా ఇంగ్లీష్,సోషల్ స్టడీస్ సబ్జెక్టులను పదవ తరగతి విద్యార్థులకు భోధించి డివిజన్ స్థాయిలో అనేకసార్లు ప్రథమ స్థానంలో నిలిపి,హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రెండుసార్లు పదోతరగతి ఫలితాల్లో పాఠశాలను మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.రాత్రి తొమ్మిది వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అదనంగా ఎన్.ఎం.ఎం.ఎస్ లో అటు రాష్ట్ర,జిల్లా స్థాయిలో అనేకసార్లు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తుచేశారు.కరోనా సమయంలో దాతల సహకారంతో చనిపోయిన 23 మంది చేనేత కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం,అలాగే వందల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసి దాతృత్వం చాటుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు.తాను పని చేస్తున్న పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రజా ప్రతినిధులతోనూ మరియు అధికారులుతోను సత్సంబంధాలు కలిగి ఉండి వారి సేవలు పాఠశాలకు ఉపయోగపడినట్లు కృషిచేసి అటు ఉపాధ్యాయులకు ఇటు చేనేత కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా పురం వెంకటరమణ నిలుస్తున్నారన్నారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని,భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ సుబ్రహ్మణ్యం,సమగ్ర శిక్ష ఏపిసి నున్నా అనురాధ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :