నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్10 : గత అవినీతి వైకాపా పాలనలో సాగునీరు, తాగునీటికి కటకటలాడిన తంబళ్లపల్లె ప్రజానీకానికి హంద్రీనీవా తో సాగునీరు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ధీమాగా చెప్పారు. బుధవారం మండలంలోని ఆర్ ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోటలో జల్జీవన్ మిషన్లో భాగంగా 60 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన పూజలు చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏఈఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తంబళ్లపల్లెలో90 వేల లీటర్లు తర్వాత 60 వేల లీటర్ల సామర్థ్యంతో అతిపెద్ద ట్యాంక్ నిర్మాణం తో మారుమూల ప్రజల కు స్వచ్ఛ జలాలు అందించడం జరుగుతుందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటి పథకం నిర్మాణాలపై స్థానిక కూటమి నాయకులు,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సంజయ్, మాజీ సర్పంచ్ సిద్ధమల్ రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, టిడిపి నాయకులు జి నరసింహులు, వీరాంజనేయులు, మోహన్ బాబు, సురేంద్ర, చిన్న రెడ్డప్ప, జగడం అనిల్, రోహిత్ కుమార్, రాకేష్, నాగేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News