నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో శనివారం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ కూడలిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలోను,సమతా సైనిక దళ్ నాయకుల ఆధ్వర్యంలో, రామసముద్రం జడ్పీ హైస్కూల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సమాన హక్కులకు అందించేందుకు ఎనలేని కృషిచేసి రాజ్యాంగాన్ని రచించారని అన్నారు.నవభారత నిర్మాణానికి దార్శనికుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, గెవన్న, క్రిష్ణప్ప, కొమ్ము నారాయణస్వామి, క్రిష్ణప్ప, శివ, జయరాజ్, బాలాజీ, రామాంజులు, అంబరీష్, మెకానిక్ వెంకటేష్, లక్ష్మీపతి, ఎస్ నారాయణస్వామి, ప్రవీణ్, రెడ్డెప్ప , షమీ, చాంద్ భాష, వాలెప్ప, ఎంఈఓ 2 ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News