నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 27 : తంబళ్లపల్లె మండలంలో ప్రజలు శుక్రవారం శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె రామాలయంలో టిఎన్ ఫ్యామిలీ సహకారంతో వారి ప్రతినిధి రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చకులు శ్రీనివాస స్వామి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి సాయంత్రం ఆలయ ఆవరణంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం స్వామివారిని తంబళ్లపల్లె పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం తో పాటు అన్నదానం నిర్వహించారు.
Reporter
Namitha News