నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - అక్టోబర్ 05 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు యన్.సి.సి క్యాడెట్ కే.ఇసాక్ ఎనోశ్ జాతీయ స్థాయీ జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్ పోటీలో సిల్వర్ పతకం సాధించారు అని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా థాల్ సైనిక్ క్యాంప్ (AITSC-2025) లో ప్రతిభ కనపరిచిన ఈ క్యాడెట్ కు ఈ ఘనత లభించిందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల నుంచి 91 మంది క్యాడెట్లతో కూడిన డైరెక్టరేట్ పోటీదారులు అద్భుతమైన ప్రదర్శన చేసారని, అందులో మిట్స్ యెన్.సి.సి క్యాడెట్ భాగస్వామి అవడం గర్వముగా ఉందని అన్నారు. వరుసగా 11 క్యాంపులు లో పాల్గొని ఈ ఘనత సాధించిన ఈ విద్యార్థిని మరియు తండ్రి కే.జెర్మియా, తల్లి కే.ఎస్తేర్ రాణి ని ఈ సందర్బంగా అభినందనలు తెలియజేసారు. యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్స్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్ నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ ,యెన్.సి.సి లెఫ్ట్ నెంట్ డాక్టర్ నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్. యెన్.వి, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్ర దయా తదితరులు ఈ క్యాడెట్ కు అభినందనలు తెలియజేసారు.
Admin
Namitha News