Thursday, 16 April 2026 03:17:09 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లాను వ్యర్థ రహితంగా రూపొందించాలి

Date : 28 March 2026 10:30 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత (జీరో వేస్ట్) కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు

శనివారం మదనపల్లి పట్టణంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ నెలకు “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా విద్యాసంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని సరైన విధంగా వేరు చేసి నిర్వహించకపోతే పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, హానికర వ్యర్థాలను వేర్వేరు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, క్యాంటీన్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, ప్రతి సంస్థ తమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నగదు లేదా వస్తువులు అందించే విధానం అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. పర్యాటక ప్రదేశాలు, అడవుల్లో చెత్త పారవేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా శుభ్రతను పాటించాలని సూచించారు. శుభ్రత ఒక రోజు కార్యక్రమం కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థులు ఈ శుభ్రత సందేశాన్ని తమ కుటుంబాలకు, సమాజానికి తీసుకెళ్లి ప్రతి ఇంటిని కూడా జీరో వేస్ట్ కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డీఎల్‌డీఓ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మసూద్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :