Sunday, 13 September 2026 06:07:30 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లాను వ్యర్థ రహితంగా రూపొందించాలి

Date : 28 March 2026 10:30 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత (జీరో వేస్ట్) కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు

శనివారం మదనపల్లి పట్టణంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ నెలకు “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా విద్యాసంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని సరైన విధంగా వేరు చేసి నిర్వహించకపోతే పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, హానికర వ్యర్థాలను వేర్వేరు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, క్యాంటీన్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, ప్రతి సంస్థ తమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నగదు లేదా వస్తువులు అందించే విధానం అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. పర్యాటక ప్రదేశాలు, అడవుల్లో చెత్త పారవేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా శుభ్రతను పాటించాలని సూచించారు. శుభ్రత ఒక రోజు కార్యక్రమం కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థులు ఈ శుభ్రత సందేశాన్ని తమ కుటుంబాలకు, సమాజానికి తీసుకెళ్లి ప్రతి ఇంటిని కూడా జీరో వేస్ట్ కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డీఎల్‌డీఓ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో తాజ్ మసూద్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :