నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చ్ 05 ః తంబళ్లపల్లె కు సమీపంలోని కస్తూరిబా బాలికల గురుకులంలో ఏడవ తరగతి చదువుతున్న తులసిప్రియ గత శివరాత్రికి తన స్వగ్రామం దిగువ పాలెం పంచాయితీ చింతలరేవుపల్లెకు వెళ్లి తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఎంఈఓ త్యాగరాజు, అంగన్వాడి సూపర్వైజర్ రమణమ్మ, మహిళా పోలీస్ శివ కుమారి లు బాలిక స్వగ్రామం చేరుకుని భవిష్యత్తులో విద్య యొక్క ఆవశ్యకతను వారి తల్లిదండ్రులతో పాటు బాలిక కు కౌన్సిలింగ్ ఇచ్చి కస్తూరిబా పాఠశాలలో తిరిగి చేర్పించారు. తులసి ప్రియను పాఠశాలకు తరలించడానికి సహకరించిన అధికారులకు కస్తూరిబా గాంధీ గురుకుల ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News