నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కొనియాడారు. సోమవారం ఆయనకు గుండ్లపల్లి పెద్దచెరువు చైర్మన్ సిద్ధమల్ రెడ్డి, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి పనులకు సాయినాథ్ పూజలు నిర్వహించి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా దోపిడీ చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల అభివృద్ధి పనులతో బాటు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా కూటమికే దక్కినట్లు చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు 15 ఏళ్ల వరకు తిరుగు లేదని వైకాపా అడ్రస్ గల్లంతు ఖాయమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. ఆయన వెంట క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, జైపాల్ నాయుడు, శివారెడ్డి, పెద్ద వీరభద్ర, మధు నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, కూటమి నాయకులు, గుండ్లపల్లి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News