నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 31 ః మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని ఆదివారం అటవీ శివార్ల ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల శివ భక్తులు, ప్రజలు సాదికొండ పైకెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులోని సాధు కొండకు అటవీ ప్రాంతంలో కాలినడకన కొండకు చేరుకొని తొలుత వీరన్న గెవి చేరుకొని అక్కడి పుణ్య జలాలకు పూజలు నిర్వహించి అనంతరం కొండపైకి చేరుకుని అక్కడ నెలవైన మహా శివుని తోబాటు నంది విగ్రహానికి పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన మల్లయ్య కొండల్లో ఆ మహా శివుని దర్శించుకుంటున్నామని ఈ కొండల ద్వారా వేలాదిమంది జీవన ఉపాధితో పాటు పర్యావరణం, లక్షలాది జీవరాశులకు ఆశ్రయం కోల్పోయి ఆశ్రయం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లక్షలాదిమంది భక్తుల మనోభావాలను గుర్తించి మైనింగ్ చర్యలను మానుకోవాలని కోరారు
Reporter
Namitha News