నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగడంతో తంబళ్లపల్లెలో పారిశుద్ధ్యం స్తంభించింది. ఈ సమస్యపై వార్త పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు ప్రచురితవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల అధికారులు దిగి వచ్చారు. బుధవారం తంబళ్లపల్లె టిడిపి నాయకులు రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రెడ్డప్ప, ఐసుల కృష్ణలు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను నిలదీసి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, మరమ్మత్తుల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏవో థామస్ రాజా లు పారిశుధ్య కార్మికులతో చర్చలు జరిపి జీతాలు చెల్లించడానికి రెండు రోజులు గడువు కావాలని కొత్త ఎంపీడీవో తో చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పి తంబళ్లపల్లెలో ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం పనులు చేపట్టాలని సూచించారు. టిడిపి నాయకులు, అధికారుల సూచనలతో పారిశుద్ధ్య కార్మికులు శాంతించి ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదని మా కడుపు కాలి ఈ చర్యకు దిగామని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా తమ విధులు నిర్వహిస్తామని కార్మికులు మస్తాన్, పద్మావతి, ఖాదర్ బాషా బృందం ఒప్పుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఏవో మాట్లాడుతూ తంబళ్లపల్లె పారిశుద్ధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు జీతాలతో పాటు వారికి చెల్లించాల్సిన మొత్తం మరమ్మత్తుల బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపట్టామని హామీ ఇచ్చారు
Reporter
Namitha News