Thursday, 30 July 2026 01:09:22 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి దిగివచ్చిన అధికారులు

సమసిన పారిశుధ్య కార్మికుల సమస్య - రెండు రోజుల్లో వేతనాలు చెల్లింపులు

Date : 04 June 2026 08:08 AM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగడంతో తంబళ్లపల్లెలో పారిశుద్ధ్యం స్తంభించింది. ఈ సమస్యపై వార్త పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు ప్రచురితవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల అధికారులు దిగి వచ్చారు. బుధవారం తంబళ్లపల్లె టిడిపి నాయకులు రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రెడ్డప్ప, ఐసుల కృష్ణలు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను నిలదీసి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, మరమ్మత్తుల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏవో థామస్ రాజా లు పారిశుధ్య కార్మికులతో చర్చలు జరిపి జీతాలు చెల్లించడానికి రెండు రోజులు గడువు కావాలని కొత్త ఎంపీడీవో తో చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పి తంబళ్లపల్లెలో ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం పనులు చేపట్టాలని సూచించారు. టిడిపి నాయకులు, అధికారుల సూచనలతో పారిశుద్ధ్య కార్మికులు శాంతించి ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదని మా కడుపు కాలి ఈ చర్యకు దిగామని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా తమ విధులు నిర్వహిస్తామని కార్మికులు మస్తాన్, పద్మావతి, ఖాదర్ బాషా బృందం ఒప్పుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఏవో మాట్లాడుతూ తంబళ్లపల్లె పారిశుద్ధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు జీతాలతో పాటు వారికి చెల్లించాల్సిన మొత్తం మరమ్మత్తుల బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపట్టామని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: