నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 25 ః తంబళ్లపల్లె క్రాస్ రోడ్ నుండి మోడల్ స్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించే స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి వెంటనే పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. హాయ్ నాదేశాల మేరకు మంగళవారం పంచాయతీ కార్యదర్శిలు ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు, పద్మావతి, భాస్కర్ లు పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. సమస్య పరిష్కారం కావడంతో ఎంఈఓ త్యాగరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, ఆర్ఎంపీ డాక్టర్ మున్నా, వైకాపా నాయకుడు ఆధార్ మల్లి, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News