Wednesday, 29 July 2026 10:54:35 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

హోటళ్ళలో రోజు టిఫెన్ తింటున్నారా..ఇక మీ సంగతి అంతే ..!

ఆనారోగ్యానికి కేరాఫ్‌ గా మారుతున్న పుంగనూరు టిఫిన్ సెంటర్లు..

Date : 22 June 2026 08:54 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,పుంగనూరు లో ఆలస్యం గా వెలుగు చూసిన ఘటన కు సంబదించిన వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని ఎం.బి.టి రోడ్డులో మసీదుకు ఎదురుగా ఉన్న అల్పాహార హోటల్‌లో బాబు అనే వ్యక్తి రెండు దోసెలను మంగళవారం రాత్రి కొనుగోలు చేశాడు. ఈ దోసెలను హోటల్‌ వారు ప్లాస్టిక్‌ కవర్లలో వేసి ప్యాక్‌ చేసి ఇచ్చారు. ఇంటికి చేరుకుని తిందామని పొట్లం విప్పి చూడగా దోసెలు కవర్లపై ఉన్న కెమికల్‌ రంగుతో మారిపోయింది. తినలేక పడేయాల్సి వచ్చింది. హోటల్‌ యజమానిని అడుగుగా దురుసుగా సమాధానం ఇచ్చాడన్నాడు.ఆరోగ్య రక్షణ లో భాగంగా ఆహార పదార్థాలలో ప్లాస్టిక్‌ వినియోగంతో కెమికల్స్ రావడంపై బాధితుడు మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి కి ఫిర్యాదు చేశారు. ఆయన ఆహారానికి సంబంధించి తమ పరిధిలో లేదని ,అన్నమయ్య జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వారు పుంగనూరు అన్నమయ్య జిల్లా పరిధిలోకి రాలేదని , చిత్తూరు వారిని సంప్రదించాలని సూచించారు. దీనిపై బాధితుడు చిత్తూరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అక్కడి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురులక్ష్మీ స్పందించి ప్లాస్టిక్‌ వినియోగం మున్సిపాలిటి పరిధిలోకి వస్తుందని, ఆహారంలో కల్తీలు ఉంటే తాము చర్యలు తీసుకుంటామని, దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ కు లేఖ రాస్తామని తెలిపారు. కానీ ఇది తమ పరిధిలోకి రాదంటు ఒకరిపై మరొకరు వేసుకోవడం హాస్యాస్పదం. దీనిపై బాధితుడు మాట్లాడుతూ ఆహార పదార్థాలలో ప్లాస్టిక్‌ వినియోగంతో ప్రజలు ఆనారోగ్యం భారీన పడతారని , ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వని కమిషనర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసి , న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పుంగనూరు పట్టణంలో మున్సిపల్టి అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరు తో టీ దుకాణలు,హోటల్ లలో తనిఖీ లు నిర్వహించినప్పటికీ .భోజన శాలలో విరివిగా ప్లాస్టిక్‌ వినియోగం జోరుగా సాగుతోంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ విక్రయాలు సాగుతున్న అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తున్నారు. ఆహార పదార్థాలకు కవర్ల పై ఉన్న కెమికల్‌ రంగు దోసె, ఇడ్లీలలో అతుక్కుని రంగు మారి వాటిని ప్రజలు తినడంతో తీవ్రమైన ఆనారోగ్యానికి గురౌతున్నారని, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్లాస్టిక్‌, కవర్ల వినియోగాన్ని అధికారులు ఎందుకు నిర్ములించలేక పోతున్నారు అన్న దానిపై ప్రజలు అందరు అలోచించాల్సి ఉంది.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :