నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎం.బి. ఏ) విభాగం వారు ఎం.బి.ఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యూనివర్సిటీ అధ్యాపకుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు, డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ నందు విద్యార్థులకు క్రమశిక్షణ, డ్రెస్సింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫారిన్ లాంగ్వేజ్ తదితర అంశాలపైన ప్రతి రోజు శిక్షణ తరగతులు అందిస్తున్నమని, అధ్యాపకులు విద్యార్థుల పట్ల కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించడం కూడా వారు ఉన్నత స్థాయిలో ఉండాలనే విషయాన్ని తల్లితండ్రులు అర్థం చేసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ నందు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి వారంలో 3రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీని వలన వారికి ఉద్యోగ అవకాశల కోసం చాలా ఉపయోగ పడుతుందని తెలిపారు. అదే విదంగా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు,వారి హాజరు శాతం, వారికి యూనివర్సిటీ నందు కలిపిస్తున్న మౌళిక సదుపాయాలు గురించి మీకు తెలిచేయడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రిన్సిపాల్ పి. రామనాథన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మా బాధ్యత ఎంత ఉందో తల్లి, తండ్రులకు అంతే బాధ్యత ఉందని, యూనివర్సిటీలో చదువు పూర్తి అయిన ప్రతి విద్యార్ధి కూడా ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనే మంచి ఉదేశ్యంతో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎం. బి. ఏ. డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, , కో ఆర్డినేటర్స్ డాక్టర్ గీత దేవి, డాక్టర్ జ్ఞాన ప్రసూన , అధ్యాపకులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. .
Reporter
Namitha News