Thursday, 16 April 2026 08:28:10 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ యూనివర్సిటీ యం.బి.ఏ. విద్యార్థుల తల్లితండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశం

Date : 03 January 2026 10:01 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎం.బి. ఏ) విభాగం వారు ఎం.బి.ఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యూనివర్సిటీ అధ్యాపకుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు, డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ నందు విద్యార్థులకు క్రమశిక్షణ, డ్రెస్సింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫారిన్ లాంగ్వేజ్ తదితర అంశాలపైన ప్రతి రోజు శిక్షణ తరగతులు అందిస్తున్నమని, అధ్యాపకులు విద్యార్థుల పట్ల కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించడం కూడా వారు ఉన్నత స్థాయిలో ఉండాలనే విషయాన్ని తల్లితండ్రులు అర్థం చేసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ నందు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి వారంలో 3రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీని వలన వారికి ఉద్యోగ అవకాశల కోసం చాలా ఉపయోగ పడుతుందని తెలిపారు. అదే విదంగా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు,వారి హాజరు శాతం, వారికి యూనివర్సిటీ నందు కలిపిస్తున్న మౌళిక సదుపాయాలు గురించి మీకు తెలిచేయడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రిన్సిపాల్ పి. రామనాథన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మా బాధ్యత ఎంత ఉందో తల్లి, తండ్రులకు అంతే బాధ్యత ఉందని, యూనివర్సిటీలో చదువు పూర్తి అయిన ప్రతి విద్యార్ధి కూడా ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనే మంచి ఉదేశ్యంతో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎం. బి. ఏ. డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, , కో ఆర్డినేటర్స్ డాక్టర్ గీత దేవి, డాక్టర్ జ్ఞాన ప్రసూన , అధ్యాపకులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. .

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :